top of page

మైత్రేయ మహర్షి బోధనలు - 133


ree

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 133 🌹


✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 101. శిశు పోషణ - 3 🌻


పిల్లలకు రెండు విషయములు నేర్పుడు.


2. పిల్లలు పెరుగు, పరిసరములు ప్రత్యేకముగ నుంచు కొనవలెను. పట్టణములలో నెరిగిన వారికన్న పల్లెలలో పెరుగు వారు బలవంతులగుదురు. (ప్రాణ పరముగ, చేతనపరముగ) పల్లెలలో పెరిగిన వారికున్న వనములలో పెరిగినవారు, మరింత పటిష్ట వంతులగుదురు.


వనములలో విద్యాలయము లేర్పరచి మమకార పడక, చిన్నతనముననే ఆ విద్యాలయములకు పంపి సంస్కారవంతులగు ఉపాధ్యాయులచే విద్యలభ్యసింప చేసినచో తల్లిదండ్రులు తమ కర్తవ్యమును సక్రమముగ నిర్వర్తించిన వారగుదురు. లేనిచో గమ్యమును చేరు జీవులుగ కాక చర్విత చర్వణులై సంసార చక్రమున పడి జనన, మరణములకు లోబడు జీవులుగ నేర్పడుదురు.



సశేషం.....


🌹 🌹 🌹 🌹 🌹



Comentários


Post: Blog2 Post

©2022 by DailyBhaktiMessages. Proudly created with Wix.com

  • Facebook
  • Twitter
  • LinkedIn
bottom of page