మైత్రేయ మహర్షి బోధనలు - 133
- Prasad Bharadwaj
- Jun 13, 2022
- 1 min read

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 133 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 101. శిశు పోషణ - 3 🌻
పిల్లలకు రెండు విషయములు నేర్పుడు.
2. పిల్లలు పెరుగు, పరిసరములు ప్రత్యేకముగ నుంచు కొనవలెను. పట్టణములలో నెరిగిన వారికన్న పల్లెలలో పెరుగు వారు బలవంతులగుదురు. (ప్రాణ పరముగ, చేతనపరముగ) పల్లెలలో పెరిగిన వారికున్న వనములలో పెరిగినవారు, మరింత పటిష్ట వంతులగుదురు.
వనములలో విద్యాలయము లేర్పరచి మమకార పడక, చిన్నతనముననే ఆ విద్యాలయములకు పంపి సంస్కారవంతులగు ఉపాధ్యాయులచే విద్యలభ్యసింప చేసినచో తల్లిదండ్రులు తమ కర్తవ్యమును సక్రమముగ నిర్వర్తించిన వారగుదురు. లేనిచో గమ్యమును చేరు జీవులుగ కాక చర్విత చర్వణులై సంసార చక్రమున పడి జనన, మరణములకు లోబడు జీవులుగ నేర్పడుదురు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
Comments