top of page

మైత్రేయ మహర్షి బోధనలు - 139


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 139 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 105. సదాచారము🌻


మానవజాతి యందు లెక్క లేనన్ని అస్వస్థతలున్నవి. లక్షల సంవత్సరముల నుండి, అజ్ఞానము కారణముగ జాతి యొనర్చిన దుష్కృత్యములు జాతి కర్మగ స్థిరపడి మానవుని బాధించుచున్నవి. మోటు మనుషుల కన్న సున్నితమైన మనస్సు గలవారికే, వ్యాధుల బాధ యెక్కువ. అందున దైవము ధర్మము, దయ, సత్యము, సత్కర్మ అను గుణములు నాశ్రయించిన వారికి వ్యాధుల ఆటుపోట్లు మరింత ఎక్కువగ నుండును. వారి శరీర ధాతువులు అహింసా మార్గమున సున్నితమగు చుండగ, వాతావరణ మందలి కాలుష్యము వారిని అంటుట సులభ మగుచుండును.


కావున అట్టివారు సామాన్యులకన్న కొంత భిన్నమైన ఆహార వ్యవహారాదులను ఏర్పరచుకొనవలసి యుండును. ఆచారము పేరున పెద్దలు ఈ రక్షణ కల్పించిరి. సదాచార మందు యిట్టి శ్రేయస్సు యిమిడి యున్నదని సాధకులు గ్రహించ వలెను. శుచి, శుభ్రత, దైనందిన దైవప్రార్థన, సదాచారములోని భాగములు. వీనిని అశ్రద్ధ చేయుట తగదు. మానవ సమాజమున ధార్మిక సంపత్తి కలవారు సదాచారము నవలంబించుటలో చాల వ్యాధుల నుండి పరిరక్షించు కొనగలరు. సదాచారము విషయమున అశ్రద్ధ గలవారు కంటినొప్పి, పంటి గొప్పి, అజీర్తి, ఇత్యాది బాధలకు తరచు గురి కాగలరు. సత్సాధకులు దీనిని గమనించుదురు గాక!


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

Comments


Post: Blog2 Post

©2022 by DailyBhaktiMessages. Proudly created with Wix.com

  • Facebook
  • Twitter
  • LinkedIn
bottom of page