మైత్రేయ మహర్షి బోధనలు - 142
- Prasad Bharadwaj
- Jul 1, 2022
- 1 min read

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 142 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 107. రహస్య భాషణము - 1🌻
యతీశ్వరుడొకడు తరచు జంతువులతో మాటాడుచుండెడి వాడు. అతని నివాసము ఒక వనప్రదేశమున నుండెడిది. ఆ వనమందు తేనెపట్లు యున్నవి. చీమలు పెట్టిన పుట్టలున్నవి. రామచిలుక లుండెడివి. ఇన్నిటితోపాటు కోతి యొకటి యుండెడిది. యతి వానితో తరచు సంభాషించు చుండెడి వాడు. అతడు చీమలతో యిట్లను చుండెను. "శ్రామికులారా! మీ పరిశ్రమ నెవరు గుర్తింతురు. మీ పరిశ్రమ కారణముగనే ఉన్నతోన్నతమైన మహానగరములు నిర్మింప బడచున్నవి. విష సర్పములు అందుచేరి మిమ్ములను పారద్రోలుచున్నవి.”
అతడు తేనెటీగలను చూచి యిట్లు సంబోధించుచుండెను. "జ్ఞానులారా! శ్రమకోర్చి, స్వాధ్యాయము కావించి, జాతి ఉన్నతికై మాధుర్యమును పోగుచేయుచున్నారు. అట్లు ప్రోగు చేయుటలో గల మాధుర్యము మిమ్ము ఈ కార్యమున నిలిపినది. జాతి మీరందించు మాధుర్యమును అంగళ్ళలో అమ్ముకొనుచున్నారే, కాని అనుభవించుట లేదు. మీ శ్రమా మాధుర్యము యీ జాతి కబ్బదు. ఐనను మీరు కొనసాగించు శ్రమ దైవమునకు ప్రీతి కలిగించుచున్నది. అట్లే కానిండు.”
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
Comments